ఏ.వినోద్కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'లాఠీ' షూటింగ్లో తమిళ సినీ హీరో విశాల్ గాయపడ్దారు. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించే ఈ సినిమాలో సునయన హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో విశాల్ గాయపడ్డారు. చేతి ఏముకకి గాయం కావటంతో చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్టు ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
తమిళ సినీ హీరో విశాల్ కు గాయాలు
February 12, 2022
0
Tags