అసలు ఆమెతో పాడాలి అంటే ఘంటసాల, సుశీల, లీల అందరూ దిగ్గజాలు భయపడే వారు..ఎక్కడ ఆమె గాత్రం ముందు మేము తేలిపోతామో అని..అదీ ఆమె అసమాన ప్రతిభ. ఆమెది మాధుర్యం తో కూడిన హెచ్చు స్వరములో ఏ మాత్రం రమణీయత చెడకుండా అందరినీ అలరించే గాత్రం..ఆమె సరసన పాడాలి అంటే భయం అని ఘంటసాల గారూ, సుశీలమ్మ గారూ చాలా ధైర్యం ఉండాలి అని చెప్పేవారు.
1948 లో బాలరాజు చిత్రములో పాడిన పాటయే దాదాపు యాభై ఏళ్ళ తర్వాత కూడా జంకుతూ పాడినా ఆ గాత్రములో సౌరభం అణుమాత్రం తగ్గలేదు అంటే అతిశయోక్తి కాదు.