ఆంజనేయుని జన్మ స్థలంపై నెలకొన్న వివాదాలు త్వరలోనే సద్దుమణుగుతాయని, అంజనాద్రిలో జపాలి, ఆకాశగంగా తీర్ధాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయని, గోవిందానంద సరస్వతి స్వామి టిటిడిపై విమర్శలకే పరిమితమవుతున్నారని, ఆయన చూపిన ఆధారాలు సరిగ్గా లేవని, తితిదే చూపుతున్న ఆధారాలకంటే బలమైన ఆధారాలు చూపితే అంజనాద్రి హనుమ జన్మస్థలంపై పునరాలోచిస్తామని, అప్పటి వరకు అంజనాద్రి హనుమ జన్మస్థలం అని తితిదే ఇఓ జవహర్ రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని కరకంబాడి మొక్కలు నాటిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.