బెంగాల్ వరదలకు భూటాన్ బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలి !

Telugu Lo Computer
0


భూటాన్ నుంచి ఆకస్మికంగా వెల్లువెత్తిన నీటి ప్రవాహం వల్లే తమ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనికి ఆ దేశమే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జల్‌పాయీగుడీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె, సహాయక చర్యలను సమీక్షించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు అవసరమైన అన్ని సహాయక, పునరావాస కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చూసుకుంటోందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఆమె ఆరోపించారు. భారత్, భూటాన్ మధ్య ఒక ఉమ్మడి నదీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అందులో పశ్చిమ బెంగాల్‌ను కూడా భాగస్వామిని చేయాలని తాము చాలా కాలంగా కోరుతున్నామని గుర్తుచేశారు. తమ ఒత్తిడి ఫలితంగానే ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశానికి ఏర్పాట్లు చేసిందని, దీనికి రాష్ట్ర అధికారులు హాజరవుతారని తెలిపారు.ఇటీవల డార్జిలింగ్, జల్‌పాయీగుడీ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)