ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మూసి ఉన్న రైల్వే గేటును దాటే ప్రయత్నంలో ఓ యువకుడు రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, దాద్రి ప్రాంతానికి చెందిన తుషార్ అనే యువకుడు తన బైక్పై రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే గేటు మూసి ఉన్నప్పటికీ, అతను దాని కింది నుంచి దూరి పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని బైక్ అదుపుతప్పి పట్టాలపై జారిపడింది. దీంతో అతను కిందపడిపోయాడు. వెంటనే తేరుకున్న తుషార్, సమీపిస్తున్న రైలును గమనించకుండా తన బైక్ను పైకి లేపే ప్రయత్నం చేశాడు. క్షణాల వ్యవధిలో రైలు వేగంగా దూసుకొస్తుండటాన్ని చూసి, బైక్ను వదిలేసి పక్కకు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. వేగంగా వచ్చిన రైలు అతడిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్రేటర్ నోయిడాలో రైలు ఢీకొని యువకుడు మృతి
October 13, 2025
0
Tags