తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు తిరుపతిలో ప్రారంభమైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో 'వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం' అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ కమిటీ (మహిళా సాధికారత) ఛైర్పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి నేతలు హాజరయ్యారు.
ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు
September 14, 2025
0
Tags