ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న ఓ స్పైస్జెట్ విమానం చక్రం ఊడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం అత్యవసరంగా వెనక్కి తిరిగి క్షేమంగా ల్యాండ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. టేకాఫ్ సమయంలో విమానం రన్వేపై వేగంగా వెళ్తుండగా, దాని చక్రం ఊడిపోయినట్లు గుర్తించారు. వెంటనే ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశారు. ఏటీసీ ఆదేశాల మేరకు విమానం తిరిగి ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ అథారిటీ రన్వేపై ఫైర్ టెండర్లు, అంబులెన్స్లను సిద్ధం చేసింది. విమానం సురక్షితంగా రన్వేపై దిగిన తర్వాత అందులోని 75 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్పైస్జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే, వెంటనే అధికారులు పరిస్థితిని సమీక్షించి, రన్వేను క్లియర్ చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
టేకాఫ్ అవుతున్నసమయంలో ఊడిన స్పైస్జెట్ విమానం చక్రం !
September 12, 2025
0
Tags