ఎంపీ మిథన్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో 50 వేల రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో మళ్లీ సరెండర్‌ కావాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం షరతులు పెట్టింది. కాగా ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు ఎంపీ మిథున్‌ రెడ్డి జులై 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఓవైపు మధ్యంతర బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకో వైపు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఎంపీ మిథున్‌రెడ్డి.. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.. 11న మళ్లీ సరెండర్‌ కావాలని ఆదేశించింది.. ఇక, మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రం లోగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి మిథున్‌ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)