కృష్ణా నదిలోకి భర్తను తోసిన భార్య : కాపాడిన స్థానికులు

Telugu Lo Computer
0


ర్ణాటకలోని రాయచూర్ జిల్లా కద్లూరు వద్ద సెల్ఫీ తీసుకునే సమయంలో భర్తను కృష్ణా నదిలోకి తోసివేసిన ఘటన కలకలం రేపింది. నదిలో పడిపోయిన భర్తను గ్రామస్థులు చాకచక్యంగా రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. వంతెన సమీపంలో ఓ వ్యక్తి నదిలో నుంచి సాయం కోసం అరుస్తూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే తాడు సాయంతో అతన్ని ఒడ్డుకు చేర్చారు. అయితే ఒడ్డుకు చేరిన తర్వాత అతను చెప్పిన సంగతి విని అక్కడున్న వారు షాక్ అయ్యారు. తన పేరు తాయప్ప అని భార్య చిన్నితో కలిసి బైక్ మీద ఇక్కడకు వచ్చానని చెప్పాడు. ఇక్కడకు రాగానే తన భార్య చిన్ని సెల్ఫీ తీసుకుందామని అడిగిందని, సెల్ఫీ తీసుకునే సమయంలో నదిలోకి తోసేసిందని వాపోయాడు. ఎలాగోలా ఈదుకుంటూ నదిలోని ఓ బండరాయి మీదకు చేరుకున్నానని అక్కడున్న వారికి చెప్పాడు. తన భార్య తనను చంపాలని చూస్తోందని వాపోయాడు. తన భర్త కాలు జారి నదిలో పడిపోయాడని తనకు ఏ పాపం తెలియదని భార్య చెప్తోంది. దీంతో స్థానికులు వారిద్దరిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి, అక్కడి నుంచి పంపించివేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాయప్పను నదిలో నుంచి తాడు సాయంతో బయటకు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భర్తలను చంపించిన భార్యల ఘటనలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)