స్కూటీని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మహిళ మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్, మణికొండలోని సుందర్ గార్డెన్స్ ముందు మంగళవారం ఉదయం స్కూటీని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిఆర్ సి అపార్ట్ మెంట్ లో షాలిని అనే మహిళ తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారు. ఆమె పిల్లలో విద్యాభవన్ స్కూల్ లో చదువుతున్నారు. మంగళవారం ఉదయం బస్సు మిస్ కావడంతో పిల్లలను స్కూటీపై స్కూల్ వద్ద దించి వస్తుండగా ఆమెను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)