బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్కు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను బీసీసీఐ ప్రకటించింది. టైటిల్ గెలిచిన 3-4 రోజుల తర్వాతే సెలబ్రేషన్స్ చేసుకోవాలని రూల్ విధించింది. ఈవెంట్కు బీసీసీఐ బోర్డు పర్మిషన్ తీసుకోవాలని, నాలుగు అంచెల భద్రత తప్పనిసరి అని స్పష్టం చేసింది. జిల్లా అధికారులు, పోలీసుల నుంచి అనుమతి పొందాలని సూచించింది. ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ వేదిక వరకు పూర్తి భద్రత ఉండాలిని పేర్కొంది.
ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్కు నిబంధనలను ప్రకటించిన బీసీసీఐ
June 23, 2025
0
Tags