తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టులో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు ముగిశాయి. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం
June 23, 2025
0
Tags