ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 99 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 64 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారంతా ఖేడా, అహ్మదాబాద్, కోట, మహేసానా, భరూచ్, వడోదర, అరవల్లి, ఆనంద్, జునాగఢ్, భావ్నగర్, అమ్రేలి, మహిసాగర్, భావ్నగర్కు చెందిన వారిగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు.
64 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత
June 16, 2025
0
Tags