స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడడంతో మృతి

Telugu Lo Computer
0


విశాఖపట్నంలో స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విశాఖలోని సీతమ్మధార సితార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్‌ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)