స్విగ్గీ షేర్లు మంగళవారం క్షీణించాయి. ఆరు నెలల లాకిన్ పీరియడ్ నేటితో ముగిసిన నేపథ్యంలో ఇవి ఒత్తిడికి గురయ్యాయి. దీంతో స్విగ్గీ షేర్లు ఇంట్రాడేలో ఏకంగా 7శాతం క్షీణించాయి. మార్కెట్ ప్రారంభంలోనే స్విగ్గీ షేర్లు 5 శాతం నష్టంతో రూ.305 వద్ద ప్రారంభమయ్యాయి. లిస్టింగ్ తర్వాత నమోదైన రూ.617 మార్క్ నుంచి స్విగ్గీ క్రమంగా పతనవుతోంది. ప్రస్తుతం పోస్ట్ లిస్టింగ్ గరిష్ఠ స్థాయి నుంచి సగానికి పైగా కుంగింది. ఉదయం 10:20 గంటల సమయంలో స్విగ్గీ షేర్లు 5.40 శాతం నష్టంతో రూ.303 వద్ద ట్రేడవుతున్నాయి. 'పేటీఎం' మాతృ సంస్థ 'వన్ 97 కమ్యూనికేషన్స్' షేర్లు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో ఏకంగా 5 శాతానికి పైగా షేర్లు కుంగాయి. పేటీఎం బ్రాండ్పై సేవలందించే వన్97 కమ్యూనికేషన్స్లో 4% వాటాను రూ.2,066 కోట్లకు ఆర్థిక సేవల సంస్థ యాంట్ గ్రూప్ విక్రయించనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో షేర్లపై ఒత్తిడి పెరిగింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో బ్లాక్ డీల్ ద్వారా షేర్లను విక్రయించనుందని తెలుస్తోంది. దీని ఫ్లోర్ ప్రైజ్ రూ.809.75గా నిర్ణయించినట్లు సమాచారం.
నష్టాలలో స్విగ్గీ, పేటీఎం షేర్లు ?
May 13, 2025
0
Tags