చీనాబ్ వంతెనపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ !

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెనపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది.  ఇది దేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెనగా పేర్కొంది. జమ్మూలో ఉదయం 11:30 గంటలకు రైలు కొంతసేపు ఆగింది. అక్కడ ప్రజలు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. ట్రయల్ పూర్తయిన తర్వాత దాని రెగ్యూలర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలు మొదటి ప్రయాణాన్ని కత్రా నుండి ఫ్లాగ్ చేయనున్నారు. కత్రా-శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైలు జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో చలికాలంలో పూర్తి వేగంతో నడుస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఈ రైలులో అనేక ప్రత్యేక సౌకర్యాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇందులో అధునాతన సౌకర్యాలున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటి లోపల నీరు, బయో-టాయిలెట్ ట్యాంక్‌లను గడ్డకట్టకుండా నిరోధించే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. వాక్యూమ్ సిస్టమ్ కోసం వేడి గాలిని వీటిలో కల్పించారు. ఎయిర్ బ్రేక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించారు. రైలు విండ్‌షీల్డ్‌లో పొందుపరిచిన హీటింగ్ ఎలిమెంట్‌లను కూడా కలిగి ఉంది. ఇది డ్రైవర్ ముందు ఉన్న లుకౌట్ గ్లాస్‌ను ఆటోమేటిక్‌గా డీఫ్రాస్ట్ చేస్తుంది. ఈ లక్షణాలు విపరీతమైన చలిలో కూడా ఎదురుగా ఏముందో స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాకుండా.. ఈ రైలులో ఇప్పటికే ఉన్న వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ గేట్ , మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. కాశ్మీర్ లోయను విస్తృత భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే లక్ష్యంతో 272 కి.మీ పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఈ రైలు ఒక ముఖ్యమైన ముందడుగు.

Post a Comment

0Comments

Post a Comment (0)