తెలంగాణ లో పీక్​ స్టేజీకి చేరిన కరెంట్ డిమాండ్ ​!

Telugu Lo Computer
0


తెలంగాణాలో ఎండల ప్రభావంతో కరెంట్​వినియోగం పీక్స్​కు చేరింది. నిజానికి యాసంగి పంటకాలం ముగిసినందున ఏప్రిల్​ రెండోవారం నుంచే కరెంట్​ వినియోగం తగ్గాలి. కానీ గృహ వినియోగం పెరగడంతో ఆ మేరకు కరెంట్​ డిమాండ్​ చుక్కలను తాకుతున్నది. ముఖ్యంగా నాలుగైదు రోజుల నుంచి తీవ్ర వడగాలులు, ఉక్కపోతల నేపథ్యంలో రాష్ట్రమంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరగడంతో పాత రికార్డులన్నీ కొట్టుకుపోతున్నాయి. 2023 ఏప్రిల్​ 30న రాష్ట్రంలో155.9 మిలియన్​యూనిట్ల వినియోగం ఉండగా, ఈ ఏడాది సరిగ్గా ఇదే రోజు విద్యుత్​ డిమాండ్​ 228 మిలియన్​ యూనిట్లకు చేరింది. అయినా పెరిగిన డిమాండ్​కు అనుగుణంగా ఎలాంటి పవర్ కట్స్​ లేకుండా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో జెన్​కో, సింగరేణి నుంచి గరిష్ఠంగా 86 నుంచి103 మిలియన్​యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి ఉండగా, ఈ కొరతను అధిగమించేందుకు వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నది. నిరుడు ఏప్రిల్​ నెలలో 7 వేల మెగావాట్ల నుంచి 8 వేల మెగావాట్ల వరకు కరెంట్​డిమాండ్​ఉండగా, ఈ సారి 10 వేల నుంచి 11 వేల మెగావాట్లకు చేరింది. అంటే రోజుకు 3 వేల మెగావాట్ల దాకా అదనంగా డిమాండ్​ఉంటోంది. 2023 ఏప్రిల్​30న 155.9 మిలియన్​ యూనిట్ల వాడకం ఉంటే.. ఈ ఏడాది అదే రోజు 228 మిలియన్ యూనిట్ల డిమాండ్​ నమోదైంది. 2023 ఏప్రిల్ 29,28,27, 26వ తేదీల్లో167.8 మిలియన్​యూనిట్లు,178.55 మిలియన్​యూనిట్లు,177.02 మిలియన్​యూనిట్లు, 159.00 మిలియన్​యూనిట్ల విద్యుత్​ డిమాండ్​ నమోదుకాగా, సరిగ్గా ఈ ఏడాది అవే తేదీల్లో వరుసగా 229.5 , 218.85 , 227.77, 228.18 మిలియన్​ యూనిట్ల విద్యుత్​డిమాండ్​ ఏర్పడింది. అంటే రోజుకు సగటున 50 మిలియన్​ యూనిట్ల నుంచి 75 మిలియన్​ యూనిట్ల వరకు ఎక్కువ విద్యుత్​వినియోగం జరుగుతోంది. ఎండల తీవ్రత కు తోడు గృహ విద్యుత్​వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజూవారీ కరెంట్ డిమాండ్​ 220 యూనిట్లు దాటుతోంది. మంగళవారం రాష్ట్రంలో 229 మిలియన్​యూనిట్ల డిమాండ్​ ఏర్పడగా,  ఉత్పత్తి అవుతున్నది కేవలం 97 మిలియన్​ యూనిట్లే. టీఎస్​ జెన్​కో దగ్గర 64 మిలియన్ యూనిట్ల నుంచి 79 మిలియన్​ యూనిట్ల ఉత్పత్తి ఉండగా, సింగరేణి థర్మల్​ ప్లాంట్​ నుంచి మరో 22 మిలియన్​ యూనిట్ల నుంచి 24 మిలియన్​యూనిట్ల దాకా ప్రొడక్షన్​ ఉంటోంది. అంటే నిత్యం125 మిలియన్​ యూనిట్ల నుంచి 150 మిలియన్​ యూనిట్ల దాకా లోటు ఏర్పడుతోంది. కానీ ఎట్టిపరిస్థితుల్లో కరెంట్​ కోతలు లేకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో విద్యుత్​శాఖ ఉన్నతాధికారులు సెంట్రల్​ పవర్​ జనరేషన్​ స్టేషన్లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పవర్​ బ్యాంక్​ పాలసీల ద్వారా కరెంట్​ కొనుగోలు చేసి, నిరంతరాయంగా కరెంట్​ సరఫరా చేస్తున్నారు.




Post a Comment

0Comments

Post a Comment (0)