త్వరలో కాంగ్రెస్‌లో చేరతా: ఆమంచి కృష్ణమోహన్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చీరాల నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సమావేశమయ్యారు. త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తెదేపా అధినేత చంద్రబాబు అంటే తనకెంతో గౌరవమని, తన భావజాలానికి తెదేపాతో కలిసి ప్రయాణించలేకపోయానని పేర్కొన్నారు. వైకాపా అధిష్ఠానం తనకు సముచిత స్థానం ఇచ్చి పర్చూరు నుంచి పోటీ చేయమందని తెలిపారు. కొద్ది రోజులుగా చీరాలలో సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరణ చేస్తే కాంగ్రెస్‌లో చేరాలని అభిమానులు సూచించారని చెప్పారు. ఆటో గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నా, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని అందువల్లే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పేర్కొన్నారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)