తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలం, పర్దీపూర్లో విద్యుద్ఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఓ జలాశయం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మోహన్రెడ్డి (62), మల్లప్ప (55) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుద్ఘాతానికి ఇద్దరు రైతులు బలి !
February 23, 2024
0
Tags