ముంబైలోని గోరేగావ్ ప్రాంతం, హైరైజ్ బిల్డింగ్లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు ఎనిమిది అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్ధలానికి రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు. భవనం చివరి అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతుండగా, ఆ ప్రాంతమంతటా నల్లటి పొగ వ్యాపించింది. ఇక ఈ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటివరకూ ఎలాంటి మరణాలు వెలుగుచూడకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
January 24, 2024
0
Tags