మయన్మార్ సైనిక విమానం మిజోరంలోని లెంగ్పుయ్ విమానాశ్రయంలో రన్వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్లోని మిజోరం లోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. కాగా టేబుల్టాప్ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్వేలో భారత్లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది.
మిజోరంలో రన్వేపై జారిపడిన మయన్మార్ సైనిక విమానం
January 23, 2024
0
Tags