ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ఇంఛార్జుల మార్పులతో మరోసారి సీటు దక్కడం కష్టమని భావించిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ బాలశౌరి వైఎస్ జగన్కు సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని సీఎం జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో బాలశౌరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో వైసీపీ నాలుగో లిస్టు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎంపీ బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా !
January 13, 2024
0
Tags