మధ్యప్రదేశ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇటీవల వైద్యులు సంక్లిష్టమైన ప్రక్రియను నిర్వహించారు. బీహార్లోని బక్సర్కు చెందిన 28 ఏళ్ల రోగికి తరచుగా మూర్ఛలు వస్తుండడంతో భోపాల్లోని ఎయిమ్స్ వైద్యులను సంప్రదించాడు. అతని మెదడులో కణితి కారణంగానే మూర్చలు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స ద్వారా కణితి తొలగించాలని సూచించారు. అతని వయస్సును దృష్టిలో ఉంచుకుని మేల్కొని ఉండగానే చికిత్స చేస్తామని క్రానియోటమీని సిఫార్సు చేశారు. సాధారణంగా దీనిని "మేల్కొని ఉన్నప్పుడు చేసే మెదడు శస్త్రచికిత్స" అని పిలుస్తారు, ఈ ప్రక్రియలో మెదడు పనితీరును పర్యవేక్షించడానికి రోగిని స్పృహలో ఉంచడం, కణితి తొలగింపు సమయంలో క్లిష్టమైన ప్రాంతాలు ప్రభావితం కాకుండా చూసుకోవడం ముఖ్యమైనవి. క్లిష్టమైన శస్త్ర చికిత్స సమయంలో ఇన్పేషెంట్ మాట్లాడుతూ కీబోర్డ్ వాయిస్తూ ఉన్నాడని భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. వార్తాపత్రిక చదవడం, హనుమాన్ చాలీసా పఠించడం చేశాడు. వైద్యులు అతని మెదడు నుండి కణితిని తొలగిస్తున్నప్పటికీ, రోగి ఎయిమ్స్లోని వైద్య బృందం ఏర్పాటు చేసిన సింథసైజర్పై మెలోడీలను ప్లే చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రక్రియలో పాల్గొన్న న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమిత్ రాజ్, రోగి తన దృష్టిని మరల్చడం వలన బ్రెయిన్ ట్యూమర్ ని విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు. శస్త్రచికిత్సలో ఉన్నప్పుడు ఎవరైనా సంగీత వాయిద్యాన్ని వాయించడం ఇది మొదటిసారి కాదు. అక్టోబరు 2022లో, 35 ఏళ్ల రోగి శాక్సోఫోన్ వాయించారు, వైద్యులు అతని మెదడు నుండి కణితిని తొలగించారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో అవయవ పనితీరును మ్యాప్ చేయడానికి వీలు కలుగుతుంది ఈ విధంగా రోగి మెలకువతో ఉండడం వలని అని వైద్యులు వివరించారు.
మేల్కొని ఉన్నప్పుడే శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగించిన డాక్టర్లు !
November 03, 2023
0
Tags