ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ 'ఒక దేశం-ఒకే ఎన్నికలు' ప్రతిపాదనపై మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధికి వేగవంతమైన పాలన అవసరమని, ఈ దృక్కోణంతో 'ఒక దేశం-ఒకటే ఎన్నికలు' అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నం అన్నారు. సంపన్నమైన ప్రజాస్వామ్యానికి, రాజకీయ స్థిరత్వం నిజంగా ముఖ్యమైనదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధి కోసం వేగవంతమైన పాలన అవసరమని యోగీ అన్నారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇవాళ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీని కూడా యోగీ ఆదిత్యనాథ్ స్వాగతించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ పౌరుల తరపున తానుప్రధాని మోడీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్లు సిఎం యోగి తెలిపారు. జమిలి ఎన్నికల వల్ల సమయం ఆదా అవుతుందని యోగీ వెల్లడించారు. ఎన్నికలు పదేపదే జరుగుతుండటంతో అభివృద్ధి పథంలో అవరోధాలు ఏర్పడుతున్నట్లు యోగీ తెలిపారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రతిసారీ నెల, నెలన్నర సమయం వృథా అవుతోందని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. దీన్ని నివారించడంతో పాటు వ్యయాన్ని ఆదా చేసేందుకు జమిలి ఎన్నికలు సరైన నిర్ణయం అవుతుందన్నారు. ఈ దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
ఒక దేశం-ఒకే ఎన్నికలు అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నం !
September 01, 2023
0
Tags