తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తును తెంచుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించింది. దక్షిణాదిన బీజేపీకు మిత్రపక్షంగా, ఎన్డీయే భాగస్యామ్య పార్టీగా ఉన్న ఏఐఏడీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు ఛీఫ్ కె అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే రెండు పార్టీల మధ్య పొత్తు చెడటానికి కారణమైంది. 1956లో మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాదురై హిందూమతాన్ని అవమానించారనే ఆరోపణలు రాష్ట్రంలో వివాదం రేపాయి. ఆ సందర్బంలో అన్నాదురైను దాచి పెట్టారని, క్షమాపణలు కోరడంతో తప్పించుకున్నారంటూ అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రిని అవమానిస్తే తామెలా ఊరుకుంటామని అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. మా నేతలపై విమర్శలు చేస్తుంటే ఎందుకు సహించాలని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ బీజేపీ బలమెంతో తమకు తెలుసని, బీజేపీని ఇక్కడెందుకు మోయాలని అడుగుతున్నారు.
ఎన్డీయే నుంచి వైదొలగిన ఏఐఏడీఎంకే
September 25, 2023
0
Tags