జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 5 ఆగస్ట్ 2019న రద్దు చేయడంతో పాటు జమ్ము కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తాం !
August 31, 2023
0
Tags