తొలి చిత్రాలను పంపిన విక్రమ్‌ !

Telugu Lo Computer
0


చంద్రయాన్‌ 3ని విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణ ఘట్టాన్ని లిఖించిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్‌ విక్రమ్‌ కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్‌ చేసింది. బెంగళూరులోని ఈ కేంద్రానికి నాలుగు తాజా ఫొటోలను పంపింది. ల్యాండర్‌ దిగుతున్న సమయంలో హారిజాంటల్‌ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో పోస్ట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)