వేలాది మంది కార్మికులకు పని కల్పించే వాణిజ్య నగరంలో జరిగిన హింస.. రోజువారీ వేతనం అందుకునే, తక్కువ-ఆదాయం పొందే వారిని తీవ్ర భయాందోళనలను గురిచేసింది. దీంతో ఇప్పుడు వారు గురుగ్రామ్ను విడిచిపెట్టడం మొదలుపెట్టారు. హింసకు భయపడిన ఆటో రిక్షా డ్రైవర్ రెహ్మత్ అలీ పశ్చిమ బెంగాల్కు తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. 'మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై వచ్చి, మమ్మల్ని వెళ్లకపోతే, మా మురికివాడకు నిప్పు పెడతారని బెదిరించారు. పోలీసులు రాత్రి నుండి ఇక్కడ ఉన్నారు, కానీ నా కుటుంబం భయపడి, మేము నగరం నుండి బయలుదేరుతున్నాము'అని సెక్టార్ 70A లోని మురికివాడలో నివసిస్తున్న అలీ అన్నారు. "పరిస్థితి మెరుగుపడినప్పుడు మేము తిరిగి వస్తాం" అన్నారాయన. గురుగ్రామ్లో మత హింస తర్వాత, కొంతమంది ముస్లిం వలసదారులు కనీసం కొంతకాలం నగరాన్ని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా నుహ్లోనూ కొంతమంది హిందూ వలసదారులు నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక జిల్లాలో కర్ఫ్యూ విధించడంతో పిల్లలతో సహా వలస కుటుంబాలు కాలినడకన అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన జగదీష్ మాట్లాడుతూ.. తాను గత కొన్ని నెలలుగా నుహ్లో నివసిస్తున్నానని, ఇప్పుడు ఇక్కడ భయంగా ఉందని, తన స్వగ్రామానికి వెళ్లిపోతానని చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వజీరాబాద్, ఘటా గ్రామం, సెక్టార్ 70ఎ, బాద్షాపూర్లోని మురికివాడల్లో నివసిస్తున్న ముస్లిం వర్గానికి చెందిన చాలా మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. డ్రైవర్లుగా, తోటమాలిగా, వీధి వ్యాపారులుగా, సేవకులుగా, పనిమనిషిగా పని చేసే వలస కార్మికులు భయంతో తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అంగీకరించారు.
గురుగ్రామ్ ను వీడుతున్న కార్మికులు
August 03, 2023
0
Tags