జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎంపికలో సవరణలు

Telugu Lo Computer
0


జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అర్హతల్లో కేంద్ర విద్యా శాఖ సవరణలు చేసింది. కనీసం పదేళ్ల సర్వీసు ఉన్న రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులే ఇందుకు అర్హులని పేర్కొంది. ఈ అవార్డుల కోసం ఒక్కో రాష్ట్రం నుంచి రావాల్సిన నామినేషన్ల పైనా పరిమితి విధించింది. వీటి కోసం రాష్ట్రాల నుంచి 126, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10, వివిధ స్వతంత్ర విద్యా వ్యవస్థల నుంచి 18 కలిపి గరిష్ఠంగా 154 నామినేషన్లు మాత్రమే పంపాలని పేర్కొంది. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి గరిష్ఠంగా 6 చొప్పున నామినేషన్లు రావాలని నిర్దేశించింది. ఏటా ఇచ్చే అవార్డుల గరిష్ఠ సంఖ్యను 47 నుంచి 50కి పెంచింది. అందులో 2 అవార్డులను దివ్యాంగ టీచర్లకు రిజర్వ్‌ చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు అర్హులైన వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)