83 ఏళ్ల వృద్దుడు 28 ఏళ్ల తర్వాత కోర్టు సమన్లు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌కు చెందిన 83 ఏళ్ల అచ్చన్ రెండు దశాబ్దాల క్రితం డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం అతను పక్షవాతంతో బాధపడుతున్నాడు. సోమవారం ఆయనకు అనుకోకుండా సమన్లు వచ్చాయి. బరేలీ పోలీసుల బృందం అతని బారాబంకి ఇంటికి చేరుకుని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి సమన్లు అందజేశారు. షాక్ తిన్న అచ్చన్ పోలీసులపై విరుచుకుపడ్డాడు. అచ్చన్‌ స్పందనకు ఎలా స్పందించాలో అర్థంకాని పోలీసులు వృద్ధుడిని కోర్టుకు హాజరుకావాలని కోరారు. లేని పక్షంలో చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అచ్చన్‌ చెబుతూ 1994లో జరిగిన సంఘటనను చెప్పాడు. అచ్చన్ తాను ఉత్తరప్రదేశ్ రవాణా శాఖలో డ్రైవర్‌గా పనిచేశానని చెప్పాడు. తాను సరుకు తీసుకురావడానికి బరేలీకి వెళ్ళానని, అక్కడి నుండి ఫరీద్‌పూర్‌కి వెళ్ళానని చెప్పాడు. తాను రాత్రి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేదెల బండి ఒక్కసారిగా మలుపు తిరిగింది. బ్రేకులు పనిచేయలేదు మరియు క్రాష్ అయి గేదె చనిపోయిందని చెప్పాడు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు సమాచారం అందించానని ఆయన చెప్పాడు. ఘటన అనంతరం తనకు రెండు పర్యాయాలు సమన్లు అందాయని.. ఆ రెండు సందర్భాల్లో బెయిల్ పొందానని అచ్చన్ చెప్పారు. రెండు దశాబ్దాల తరువాత ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుందని.. ఇప్పుడు కోర్టుకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిందని అచ్చన్‌ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)