పశ్చిమ బెంగాల్ లో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా సీఎం మమతా బెనర్జీ విద్యాసంస్థలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 22 వరకు మూసివేయబడతాయి. గత కొన్ని రోజులుగా పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తలనొప్పి మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఉన్న వేడి గాలుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. డార్జిలింగ్ మరియు కాలింపాంగ్ జిల్లాల్లోని కొండ ప్రాంతాలు మినహా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థలకూ సోమవారం నుంచి శనివారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు దీదీ తెలిపారు. మరో వైపు తీవ్రమైన వేడి కారణంగా పాఠశాలలకు వేసవి సెలవులను రీషెడ్యూల్ చేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 24వ తేదీ నుంచి కాకుండా మే 2 నుంచే వేసవి సెలవులు ప్రారంభమవుతాయయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 19 వరకు ఈ వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విద్యా సంస్థలకు వారం రోజులు సెలవులు !
April 16, 2023
0
Tags