టీమిండియా 571/9 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ !

Telugu Lo Computer
0


బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ లో టీమిండియా 571/9 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిం‍ది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (3), మాథ్యూ కుహ్నేమన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (128) సెం‍చరీ చేయగా, అక్షర్‌ పటేల్‌ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలతో కదం‍తొక్కగా.. అశ్విన్‌ 6 వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా, స్టార్క్‌, కుహ్నేమన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 4 మ్యాచ్‌ల ఈ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్‌లో భారత్‌ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)