ఉద్యోగుల పింఛను పథకం 1995 (ఈపీఎస్ 95) కింద అర్హులై.. 2014 సెప్టెంబరు కంటే ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈపీఎఫ్వో మే 3 వరకూ పొడిగించింది. అంతకు ముందు ఈ గడువు మార్చి 3తో ముగిసింది. ''ఉద్యోగ, యాజమాన్య సంఘాల విజ్ఞప్తుల నేపథ్యంలో అధిక పింఛనుకు సంబంధించిన జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల సమర్పణకు మే 3, 2023 వరకు గడువు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు'' అని సోమవారం కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిగిలిన అన్ని రకాల ఈపీఎఫ్వో చందాదారులకూ ఈ దరఖాస్తుల సమర్పణకు మే 3వ తేదీని తుది గడువుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అధిక పింఛనుకు గడువు మే 3 వరకు పెంపు
March 14, 2023
0
Tags