బెంగుళూరులో ఇన్ఫోసిస్ 40 వార్షికోత్సవ వేడుకల్లో సూధా మూర్తి డ్యాన్స్, పాటతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పాట పాడటమే కాదు..హుషారుగా స్పెప్పులేసి అలరించారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటను సుధామూర్తి ఉత్సాహంగా పాడారు. తనకు ఇష్టమైన సాంగ్ కావడంతో సుధా పాట పాడుతూ సరదాగా కాలు కదిపారు. పక్కన ఉన్న వాళ్లు చప్పట్లు కొడుతూ. ఆమెను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.
వార్షికోత్సవ వేడుకల్లో అలరించిన సూధా మూర్తి !
December 16, 2022
0
Tags