తమిళనాడులోని నీలగిరి జిల్లా కల్లింగరై - పాడందొరై మార్గంలో ఓ అడవి ఏనుగు రహదారిపై బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఓ కారును ధ్వంసం చేసింది. రోడ్డుపక్కనే ఉన్న చెత్తకుప్పలను తొండంతో విసిరికొట్టింది. ఆ ఏనుగును చూసి వాహనదారులు భయంతో నలువైపులా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఆ ఏనుగును మళ్ళీ అడవిలోకి తరిమికొట్టారు.
ఏనుగు బీభత్సం !
August 03, 2022
0
Tags