బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు చూసి తాను జాలి పడుతున్నానన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల కోసం బడ్జెట్లో ఏమీ లేదన్న రాహుల్ విమర్శలను ఆమె తోసిపుచ్చారు. " రాహుల్.. ముందు బడ్జెట్ను అర్థం చేసుకోవాలి. ట్విట్టర్లో ఏదొకటి పోస్ట్ చేయాలన్న హడావుడిలో బడ్జెట్లో ఏం లేదు ఇలా అనడం తగదు. ఆయన సరైన హోంవర్క్ చేయాలి. బడ్జెట్ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. ముందు ఆయన పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సంగతి చూసుకోవాలి. ఆ తర్వాత దేశం గురించి మాట్లాడితే బాగుంటుంది. " అని నిర్మలా సీతారామన్ అన్నారు.
అర్థం చేసుకునే బుర్ర మీకు లేదు: నిర్మలా సీతారామన్
February 02, 2022
0
Tags