ఆంధ్రప్రదేశ్ లో 1న జీతం, పించన్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం దివాలా తీసిందని నేతలు ధ్వజమెత్తారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మండిపడ్డారు బీజేపీ నేతలు, తమ నేతలపై పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలని హితవు పలికారు. కేసినో ఆడిస్తున్న మంత్రి కేశినేని నాని సస్పెండ్ చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం వల్లే అని గుర్తించాలన్నాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ.. ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్న నేరాలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు
1న జీతాలు ఇవ్వలేని వారు ఇంకేమి పాలిస్తారు!
January 22, 2022
0