పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం !

Telugu Lo Computer
0


దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్‌ 29 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)