విశాఖ పట్నం నుండి అయ్యప్ప స్వామి సన్నిది శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీస్ లు నిర్వహించాలని… నిర్ణయం తీసుకుందని విజయనగరం జోన్ ఈడీ రవి కుమార్ పేర్కొన్నారు. విశాఖ జోన్ నుండి 60 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విశాఖ రీజియన్ నుండి 25 బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా పిక్నిక్ లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరకు, లమ్మ సింగి, ధారకొండ ప్రాంతాలకు కూడా టూరిస్ట్ సర్వీస్ లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
విశాఖ జోన్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు
November 09, 2021
0
Tags